వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 3
3.1 గ్రామ వృక్షాలు గ్రామ నిర్మాణంలో బొడ్డురాయి కూడలి తరువాత మరో ప్రధానమైన సంగమ స్థానం పడమర బజారు, బొడ్డురాయి బజారు రెండు కలిసే కూడలి. ఒక నాడు ఈ కూడలిలో శ్రీ మహాలక్ష్మీ దేవి అంశగా పూజలు అందుకొనే పెద్ద వేప చెట్టు ఉండేది. ప్రతి శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడన్న వేప చెట్టుని పసుపు కుంకుమలతో పూజించేవారు. పకృతి ఆరాధనలో వృక్షారాధన ఒకటి. చల్లటి నీడను, ఆరోగ్యకరమైన గాలిని ప్రసాదించే వేప చెట్టు అమ్మ తల్లిగా భావించేవారు. ఇప్పుడు అక్కడ వేప చెట్టు కనుమరుగైంది. అయినా కానీ ఇప్పటికి గ్రామ జనులు పెండ్లి వంటి శుభకార్యక్రమాలు జరుపుకునే సమయంలో ఆ కూడలిలో(వీధి మధ్యలో) ఒక వేప కొమ్మని మట్టి ముద్దలో నాటి దానినే శ్రీ మహాలక్ష్మీ దేవిగా తలుస్తూ పూజలు చేస్తున్నారు. కుదించుకుపోయిన ఆ ప్రదేశంలో కొత్తగా మరో చెట్టు నాటే వెసులుబాటు నేడు లేదు. కాలగతిలో ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో బలంగా ఏళ్ళూనుకొని ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు ఏదో రకంగా ఆనాలోచనతో కొనసాగుతాయని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పడమటి కూడలికి నైరుతి దిశలో విష్ణువాలయం నిర్మించాలని 'మానసారం' లో చెప్పబడింది. ఈ సూత